Tuesday, March 6, 2012

15 నుంచి శుభా మోహన్ చిత్రాల ప్రదర్శన

ఔత్సాహిక చిత్రకారిణి శుభామోహన్ చిత్రాల ప్రదర్శన ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో మార్చి 15 వ తేది నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ చిత్రకారుడు గువ్వల కెన్నడి సతీమణి, ప్రఖ్యాత చిత్రకారిణి పద్మ శిష్యురాలిగా శుభామోహన్ సుపరిచితురాలు. తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరానికి చెందిన శుభా మోహన్ ఫ్రీ హ్యాండ్ ఆర్ట్ లో ప్రసిద్ధురాలు. ఆమె చిత్రాల ప్రదర్శనను కెన్నెడీ దంపతులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు. నగర, గోదావరి జిల్లాల కళాభిమానుల కనుల పంటగా ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు ఆనం రోటరీ హాల్లో జరగనుంది. ఈ ప్రదర్శనను కాంగ్రెస్ నాయకుడు సిఘాకోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ప్రారంభిస్తారు. ఎం ఎల్ సి కందుల దుర్గేశ్ జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశ రావు, సమాచార శాఖ ఏడి ఎం ఫ్రాన్సిస్, ఇంకా పంతం కొండలరావు, బొమ్మన రాజ్ కుమార్, పట్టపగలు వెంకటరావు, టి రామనారాయణ పాల్గొంటారు.